హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 4:
శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శిఖరం ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ‘పాటల పూదోట’ పేరుతో సినీ సంగీత విభావరి
శ్రీ త్యాగరాయ గాన సభలోని కళా మారుతి కళా వేదికలో నిర్వహించారు. శిఖరం ఆర్ట్ థియేటర్స్ అధ్యక్షుడు జి. కృష్ణ నిర్వహణలో గాయనీ గాయకులు
ప్రముఖ గాయని సాయి పవని, వెంకీ, ఇంద్రాణి, భాగ్యలక్ష్మి, సరస్వతి, రమణ, ఏడుకొండలు, సుబ్బిరెడ్డి, ఆనంద్ తదితరులు
ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.





