హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 26:
రాగమధురి మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో ‘కమేష్ ఈవినింగ్ ఆఫ్ ఎవర్ గ్రీన్ బాలీవుడ్ మెలోడీస్’ పేరిట సినీ సంగీత విభావరి చిక్కడపల్లి త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు ఎ.వి. పుల్లారావు మాట్లాడుతూ.. తమ అకాడమీ 49వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా
పాతకాలపు ఎవర్ గ్రీన్ బాలీవుడ్ మధురమైన సంగీత విభావరిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం కామేష్ నిర్వహణలో గాయకులు యశోద , స్వప్న ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.








