ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

ఆదివారం13 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:03 amసూర్యాస్తమయం 6:20 pm

ఆదివారం

13 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:03 am

సూర్యాస్తమయం 6:20 pm

SENSEX74,782-1.77%
NIFTY23,398-1.60%
హైదరాబాద్ 22K₹1,44,640/10g+0.34%
హైదరాబాద్ 24K₹1,57,789/10g+0.34%
వెండి₹2,16,278/kg-1.67%

తాజా వార్తలు

భీమా వ్యాపారానికి సానుభూతి ప్రధాన ఇతివృత్తంగా ఉండాలి -భీమా నియంత్రణ

IRDAI Chairman Ajay Seth highlighted the growing career opportunities in India's insurance sector during the IIRM convocation held in Hyderabad.

nagendra13 September 2026, 2:41 AM0 చూసులుtrinetnews.com
భీమా వ్యాపారానికి సానుభూతి ప్రధాన ఇతివృత్తంగా ఉండాలి  -భీమా నియంత్రణ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 12:

భీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) మరియు తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ (ఐఐఆర్ఎం), పట్టభద్రులైన విద్యార్థుల విద్యా విజయాలను వేడుకగా జరుపుకుంటూ, పీజీడీఎం 2024–26 బ్యాచ్ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఆర్‌డీఏఐ ఛైర్మన్ అజయ్ సేథ్, పట్టభద్రులైన విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రత్యేక కోర్సులలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లను అందజేసి మాట్లాడుతూ భారతదేశ భీమా మరియు రిస్క్ మేనేజ్‌మెంట్ రంగంలో విస్తరిస్తున్న ఉద్యోగ అవకాశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. వేగంగా మారుతున్న ఈ పరిశ్రమలో నిపుణులు విజయం సాధించడానికి నిజాయితీ, సాంకేతికత, ఆవిష్కరణలు మరియు నిరంతర అభ్యాసం చాలా కీలకమని ఆయన నొక్కి చెప్పారు. భీమా రంగంలోని మానవ కోణాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, భీమా వ్యవస్థలో సానుభూతి కేంద్రంగా ఉండాలని, "అందరికీ భీమా" సాధించడానికి మరియు విక్సిత్ భారత్ దార్శనికతకు దోహదపడటానికి ఇది అత్యవసరం అని ఆయన నొక్కి చెప్పారు.

గౌరవ అతిథిగా విచ్చేసిన ఐఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ సందీప్ కుమార్ శుక్లా, పట్టభద్రులను అంతర్విషయక అభ్యసనం, సాంకేతిక పురోగతి మరియు జీవితకాల నైపుణ్యాభివృద్ధిని స్వీకరించమని ప్రోత్సహించారు. సాంకేతికతను మానవ సామర్థ్యాలతో సమతుల్యం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెబుతూ, సాధనాలు మరియు సాంకేతికతకు మానవ విచక్షణ తోడుగా ఉండాలని, "సాంకేతికతను సద్వినియోగం చేసుకోండి, కానీ మానవ విచక్షణను వదులుకోవద్దు" అని పట్టభద్రులను ఆయన కోరారు. ఐఐఆర్ఎం డైరెక్టర్ ఆటాను కె. దాస్ మాట్లాడుతూ భీమా మరియు రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ కోసం నైతిక విలువలు కలిగిన, సాంకేతికంగా సన్నద్ధులైన మరియు పరిశ్రమకు సిద్ధంగా ఉన్న నిపుణులను అభివృద్ధి చేయడంలో ఐఐఆర్‌ఎం యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించరు. ఐఐఆర్ఎం కంట్రోలర్ అఫ్ ఎక్సమినేషన్స్ డా, సి. మాధవి ప్రసాద్ వందన సమర్పణ చేసారు.

ఇవి కూడా చదవండి