24గంటల విద్యుత్ లేక రైతుల ఇబ్బందులు
ట్యాంకర్లతో వరిపంటకు నీటిని పొయిస్తున్న రైతు మహేందర్ రెడ్డి
ట్రై నెట్ న్యూస్, సెప్టెంబరు05/:
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం తిమ్మాపురం గ్రామంలో బోరుబావులలో నీళ్లు తగ్గిపోవడం,విద్యుత్ లోవోల్టేజ్ వల్ల, విద్యుత్ కోతల వలన, వర్షాలు కురవక పోవడం వల్ల చేతికి అందివచ్చే సమయంలో నీళ్లు లేకపోవడంతో ట్యాంకర్లతో వరిపంటకు నీటిని పోయిస్తున్న రైతు తిమ్మాపురం గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ తుమ్మల మహేందర్ రెడ్డి. కనీసం రోజుకు 40-50 ట్యాంకర్ల నీటిని పోయిస్తున్నను అని రైతు మహేందర్ రెడ్డి ఆవేదనతో తెలిపారు.భుమిలో నీటి లెవల్ తగ్గిపోయింది. వ్యవసాయానికి ఇచ్చే 24 గంటల విద్యుత్ను 12గంటలకు తగ్గించారు,ఆ12 గంటల్లో వచ్చే విద్యుత్కు కోతలు విధించటం వలన, వచ్చినప్పటికీ విద్యుత్ లోవోల్టేజ్ వలన మోటార్లు సక్రమంగా నడవలేకపోవడం వలన వరికి నీరు సరిపోవడం లేనందున ట్యాంకర్లతో నీటిని వరిపంటకు తడపడం జరుగుతుందని అన్నారు. అయినను సరిపడా నీటిని అందించలేక పోతున్నామనీ బాధతో పత్రికల వారికి తెలిపారు.ప్రజాప్రభుత్వం అని చెప్పుకోవడమే తప్ప రైతులకు చేసింది ఏమీ లేదని రైతు మహేందర్ రెడ్డి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.





