నాచారం, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 19 : వినాయక చవితి సందర్భంగా నాచారం పరిధిలో గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. బాబానగర్లోని సూర్య శుభకర విజ్ఞ వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో 15 అడుగుల ఎత్తైన పర్యావరణహిత వినాయక విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేసి ప్రతిష్ఠించారు. సుమారు వెయ్యి ఇస్తారాకు కప్పులతో రూపొందించిన ఈ విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా కళాకారుడు సూర్య ప్రకాష్ మాట్లాడుతూ గత 17 ఏళ్లుగా తామే స్వయంగా పర్యావరణహిత వినాయక విగ్రహాలను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో పేపర్ స్ట్రాలు, రూబిక్స్ క్యూబ్స్, చెక్క స్టిక్స్, మట్టి ప్రమిదలు, పేపర్ టీ కప్పులు, బిస్కెట్ కోన్స్, దారం, న్యూస్ పేపర్లతో వినూత్న విగ్రహాలను రూపొందించినట్లు చెప్పారు. చంద్రయాన్ స్ఫూర్తితోనూ ప్రత్యేక థీమ్తో విగ్రహాన్ని తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఉత్సవాల అనంతరం పర్యావరణహిత పద్ధతిలో వైభవంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
నాచారంలో ఆకట్టుకుంటున్న పర్యావరణహిత గణనాథుడు.. ఇస్తారాకు కప్పులతో 15 అడుగుల వినాయకుడు..
An eco-friendly 15-foot Ganesha idol made from about 1,000 leaf plates is captivating devotees in Nacharam for Vinayaka Chavithi.

ఈ వార్తను షేర్ చేయండి
లింక్లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
కెంట్ యూనివర్సిటీతో ఓయూ విద్యా, పరిశోధన భాగస్వామ్యంపై చర్చలు..

Osmania University and the University of Kent held a meeting to explore mutual cooperation in academics and research.
మిగతా చదవండి →సింగరేణి కార్మికుల ఇళ్ల స్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారం:

The state government has stepped in to resolve long-pending housing plot issues for Singareni workers, setting up three-member committees headed by district collectors with a 45-day deadline.
మిగతా చదవండి →భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

మట్టి గణపయ్యను దర్శించుకున్న పోలా సైదులు గుప్తా నల్లగొండ జిల్లా ఇన్చార్జ్: విశ్వనాథ్

Anumula Mandal Arya Vaisya President Pola Saidulu Gupta offered prayers to the clay Ganesha installed in Haliya town.
మిగతా చదవండి →