ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

మంగళవారం8 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:03 amసూర్యాస్తమయం 6:24 pm

మంగళవారం

8 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:03 am

సూర్యాస్తమయం 6:24 pm

SENSEX76,133-1.05%
NIFTY23,779-1.15%
హైదరాబాద్ 22K₹1,44,959/10g+2.78%
హైదరాబాద్ 24K₹1,58,137/10g+2.78%
వెండి₹2,20,954/kg+4.24%

తాజా వార్తలు

ఆత్మీయుల మధ్య అత్యంత ఘనంగా డా లక్ష్మివీర మల్లు జన్మదిన వేడుకలు

Social worker and Padma Shali community advisor Dr. Lakshmi Veera Mallu's birthday was celebrated grandly in Boduppal with cake cutting and felicitations.

nagendra8 September 2026, 1:37 AM0 చూసులుtrinetnews.com
ఆత్మీయుల మధ్య అత్యంత ఘనంగా డా లక్ష్మివీర మల్లు జన్మదిన వేడుకలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ట్రై నెట్ న్యూస్,యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు07:

సామాజిక కార్యకర్త, రా చెరువు పరిరక్షణ సమితి, అనుశ్రీ, సాయి అనుశ్రీ నగర్ వ్యవస్థాపక అధ్యక్షులు,పద్మ శాలి సంఘము ముఖ్య సలహా దారులు డా లక్ష్మివీర మల్లు జన్మదిన వేడుకలు పద్మ శాలి సంఘము పెద్దలు బోడుప్పల్ సీనియర్ నాయకులు యాదవ సంఘము అధ్యక్షులు మాజీ వార్డ్ మెంబర్ తోట కూర రవీందర్ యాదవ్ అనుశ్రీ, సాయి అనుశ్రీ నగర్, మల్లయ్య నగర్,గాయత్రి, సప్తగిరి కాలనీల మిత్రుల సమక్షంలో కేక్ కట్టింగ్, సన్మాన కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది.ఈ సందర్బంగా డా లక్ష్మి వీరమల్లు మాట్లాడుతూ అందరి ఆదరాభిమానాలు,సహాయ సహాకారాలు ఉన్నంత వరకు నేను మీ వెంట ఉండి వీలైనంత లో సామాజిక కార్యక్రమంలో ముందుకు వెళదాం అని ముక్యంగా బోడుప్పల్ లోని సుమారుగా అందరు నాయకులు,మున్సిపల్ అధికారులు, సిబ్బంది అనేక కాలనీల మిత్రులు, వివిధ సంఘాలు,స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, రా చెరువు ప్రాంతం మిత్రులు, మీడియా ప్రతినిధులు అందించిన సహాయ సహకారాలు నేను సామాజిక కోణం వైపు ప్రయాణం చేసే అవకాశం అందించిందిచిన మీ అభిమానం నన్ను ఈ విధంగా ముందుకు తీసుకొని వెళ్తుందని చెప్పారు.ఈ కార్యక్రమం నిర్వాంచిన మిత్రులకు,ఫోన్ ద్వారా, మెసేజ్ ద్వారా, స్వయంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్బంగా తోట కూర రవీందర్ స్పందిస్తూ డా లక్ష్మివీర మల్లు నాకు పరిచయం అయి పది సంవత్సరాలు అయింది అప్పటి నుండి ఇప్పటి వరకు తాను సామాజిక పరంగా చేసే కార్యక్రమాలు నేను ఎంతగానో మంత్రాముగ్ధులను చేసాయి. రా చెరువు అభివృద్ధి విషయంలో తాను ఒక ముఖ్య పాత్ర పోషించి నాయకుల, ప్రజా సంఘాల,స్వచ్చంద సంస్థల,అధికారుల మన్ననలు పొందారు. రా చెరువు విషయంలో బోడుప్పల్ ప్రజల్లో తాను ఒక ముద్ర వేసుకున్నారు. అది జీవితంలో ఒక మైలు రాయిగా మిగిలింది. ఇప్పుడు అయన పేరు రా చెరువు వీరమల్లు అనే విధంగా తాను అందరిని కలుపుకొని ప్రయాణం సాగించారు. ఇలాంటి వారికి దేవుడు ఆయురారోగ్యాలతో ఉంటూ ఇంకా సమాజానకి ఎన్నో విధాలా ఉపయోగ పడే విదంగా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పారు. పద్మ శాలి సంఘము పెద్దలు మాట్లాడుతూ సంఘానికి వారు అందించే సూచనలు మాకు ఎంతో దైర్యంగా ముందుకు వెళ్లే విదంగా ఉంటాయి అని అభిప్రాయం వ్యక్తం చేసారు. కాలనీల సభ్యులు కూడా ప్రతీ విషయంలో మాకు సూచనలు అందిస్తు మమ్మల్ని భుజం తడుతూ కాలనీల అభివృద్ధి విషయంలో యువత ముందుకు సాగాలి అని అనునిత్యం మాకు చెబుతున్న తీరు మాకు ఎంతగానో సంతృప్తిని ఇచ్చిందని వారు ఆయురారోగ్యాలతో ఉంటూ సామాజిక కోణంలో ముందుకు సాగాలి అని అభిప్రాయం వ్యక్తం చేసారు.

ఇవి కూడా చదవండి

సీఎం క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు చావు డప్పు కొడుతున్నారు: బిఆర్‌ఎస్ నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డి

సీఎం క్షమాపణ చెప్పాలి  కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు చావు డప్పు కొడుతున్నారు: బిఆర్‌ఎస్ నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డి

BRS leader Kalluri Ramachandra Reddy demanded that Chief Minister Revanth Reddy apologize for governance failures, stating the public is turning against Congress.

మిగతా చదవండి →