హైదరాబాద్, రవీంద్ర భారతి ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 1:
బీజేపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగంమేడ్చల్, మల్కాజిగిరి జిల్లా
రాష్ట్ర సాంస్కృతిక విభాగం సభ్యురాలిగా డా. బోనాల కిరణ్మయి ఎన్నికైయ్యారు. ఈ మేరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు
రామచంద్రా రావు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బిజెపి సంస్కృతిక
బోనాల కిరణ్మయి చేస్తున్న సేవలకు గుర్తింపుకు గాను సంస్కృతిక రంగంలో అవకాశం కల్పించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సంస్కృతిక రంగానికి పెద్ద పీట వేస్తుందని పేర్కొన్నారు. డా. బోనాల కిరణ్మయి మాట్లాడుతూ .. తనపై నమ్మకంతో బీజేపీ పార్టీ సంస్కృతిక విభాగంలో అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉందన్నారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయడానికి మరింత కృషి చేస్తానన్నారు. తనకు పార్టీలో పదవి ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు , సంస్కృత విభాగం కన్వీనర్ బీజేపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగుపురం రాజమౌళి గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.





