ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

మంగళవారం8 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:03 amసూర్యాస్తమయం 6:24 pm

మంగళవారం

8 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:03 am

సూర్యాస్తమయం 6:24 pm

SENSEX76,133-0.57%
NIFTY23,684-0.96%
హైదరాబాద్ 22K₹1,45,467/10g+2.96%
హైదరాబాద్ 24K₹1,58,691/10g+2.96%
వెండి₹2,21,904/kg+4.50%

తాజా వార్తలు

డా. ఆలూరి విజయలక్ష్మికి ‘వంశీ-భానుమతి జాతీయ సాహితీ పురస్కారం-2026’ భానుమతి రామకృష్ణ 102వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం

Dr. Aluri Vijayalakshmi will receive the Vamsi-Bhanumathi National Literary Award 2026 during the 102nd birth anniversary celebrations of Padma Bhushan Dr. P. Bhanumathi Ramakrishna in Hyderabad.

nagendra8 September 2026, 2:15 AM1 చూసులుtrinetnews.com
డా. ఆలూరి విజయలక్ష్మికి ‘వంశీ-భానుమతి జాతీయ సాహితీ పురస్కారం-2026’  భానుమతి రామకృష్ణ 102వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 7:

ప్రముఖ రచయిత్రి, నటీమణి, దర్శకురాలు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి, పద్మభూషణ్ డా. పి. భానుమతి రామకృష్ణ 102వ జయంతిని పురస్కరించుకుని ‘వంశీ-భానుమతి జాతీయ సాహితీ పురస్కారం-2026’ను ప్రముఖ రచయిత్రి, సామాజిక సేవావేత్త, గైనకాలజిస్ట్ డా. ఆలూరి విజయలక్ష్మికి ప్రదానం చేయనున్నారు.

వంశీ ఆర్ట్ థియేటర్స్, వంశీ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సహకారంతో లేఖిని తెలుగు రచయిత్రుల మహావేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ, కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించనున్నారు.

కార్యక్రమానికి తెలుగు అకాడమీ చైర్మన్ ఆచార్య కూరపాటి వెంకట నారాయణ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రముఖ సాహితీవేత్త డా. వోలేటి పార్వతీశం సభకు అధ్యక్షత వహించనుండగా, రచయిత్రి డా. అమృతలత సభను ప్రారంభించనున్నారు. ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు విశిష్ట అతిథిగా పాల్గొననున్నారు.

వంశీ సంస్థల వ్యవస్థాపకుడు కళాబ్రహ్మ శిరోమణి డా. వంశీ రామరాజు స్వాగతోపన్యాసం చేయనున్నారు. ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి ప్రత్యేక అతిథిగా పాల్గొంటారు. వంశీ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి శైలజ సుంకరవల్లి కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా భానుమతి రామకృష్ణ సాహిత్యం, నటనా వైదుష్యం, ‘అత్తగారి కథలు’, ‘నాలో నేను’ తదితర రచనలపై సాహితీవేత్తలు, రచయిత్రులు ప్రసంగించడంతో పాటు భానుమతి ఆలపించిన పాటల ప్రత్యేక కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

సీఎం క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు చావు డప్పు కొడుతున్నారు: బిఆర్‌ఎస్ నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డి

సీఎం క్షమాపణ చెప్పాలి  కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు చావు డప్పు కొడుతున్నారు: బిఆర్‌ఎస్ నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డి

BRS leader Kalluri Ramachandra Reddy demanded that Chief Minister Revanth Reddy apologize for governance failures, stating the public is turning against Congress.

మిగతా చదవండి →