ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి,సెప్టెంబరు08:
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బసంతపురం గ్రామాన్ని మంగళవారం రోజు జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. బసంతాపురం గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద చేస్తున్నటువంటి సర్వే కార్యక్రమాన్ని సందర్శించి సర్వే చేసే విధానాన్ని తెలుసుకోవడం జరిగింది.అలాగే గ్రామంలోని అంగన్వాడి సెంటర్ ని సందర్శించి అంగన్వాడి సెంటర్ విద్యార్థులతో మరియు స్కూలు విద్యార్థులతో మాట్లాడి సదుపాయాలు ఎలా ఉన్నాయని తెలుసుకొని టీచర్లను అభినందించడం జరిగింది.తర్వాత గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థకు మరియు అంగన్వాడీ భవనానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. బసంతాపురం గ్రామ ప్రజలు గ్రామంలో రేషన్ దుకాణం లేనందున పక్క గ్రామమైన కాల్వపల్లికి వెళ్లి తెచ్చుకుంటూ ఇబ్బందులు గురవుతున్నారని సర్పంచ్ మెండు రత్నమాల సత్తిరెడ్డి తెలియజేయడంతో గ్రామానికి రేషన్ దుకాణం మంజూరు చేయాలని సంబంధిత అధికారితో మాట్లాడి హామీ ఇవ్వడం జరిగింది.తదనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు సక్రమంగా జరుగుతూ ఉన్నాయని తెలుసుకున్నాను మరియు సర్వేలో భాగంగా రైతులు అధికారులకు సహకరిస్తున్న విధానం చాలా బాగుంది. ఏలాంటి ఆటంకం లేకుండా సర్వే జరుగుతుందని భావిస్తున్నాను అని మరియు రాజాపేట మండలంలో చిన్న గ్రామమైన బసంతాపురం చాలా ఆదర్శంగా కనిపిస్తుంది. అలాగే మీరు ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేయాలి అని సర్పంచ్ ని అభినందించడం జరిగింది. మరియు గ్రామంలోని యువకులు మెండు భాస్కర్ రెడ్డిని మరియు మెండు ఉపేందర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బసంతాపురం గ్రామ సర్పంచ్ మెండు రత్నమాల సత్తిరెడ్డి, ఉపసర్పంచ్ గుల్లపల్లి రాజు గౌడ్ మరియు వార్డు మెంబర్లు మెండు ఉపేందర్ రెడ్డి, వడ్లకొండ మాధవి, గంధ మల్ల కవిత, వడ్లకొండ రాములమ్మ, ములకలపల్లి రమేష్ మరియు గ్రామ పెద్దలు మెండు మధుసూదన్ రెడ్డి, మెండు మహేందర్రెడ్డి,మెండు చిన్నా నరసింహారెడ్డి, మెండు సాయికుమార్ రెడ్డి, గంధమల్ల బాలకృష్ణ గౌడ్, గుల్లపల్లి వినయ్ గౌడ్, వడ్లకొండ మహేష్ బాబు, వివో మెండు పల్లవి,తదితరులు పాల్గొనడం జరిగింది.








