ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

శనివారం5 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:02 amసూర్యాస్తమయం 6:27 pm

శనివారం

5 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:02 am

సూర్యాస్తమయం 6:27 pm

SENSEX76,515-0.57%
NIFTY23,898-0.76%
హైదరాబాద్ 22K₹1,45,232/10g+1.03%
హైదరాబాద్ 24K₹1,58,435/10g+1.03%
వెండి₹2,18,997/kg+0.80%

తాజా వార్తలు

విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్న కాంగ్రెస్..... తలసాని శ్రీనివాస్ యాదవ్.

Former minister Talasani Srinivas Yadav slammed the Congress government for failing to clear fee reimbursement dues, holding a massive protest rally in Hyderabad.

nagendra5 September 2026, 9:09 AM0 చూసులుtrinetnews.com
విద్యార్థుల జీవితాలతో  చెలగాట మాడుతున్న కాంగ్రెస్.....  తలసాని శ్రీనివాస్ యాదవ్.

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్.5.

కాలేజీ పీజుల రీయింబర్స్మెంట్ చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతోందని మాజీ మంత్రి,సనత్నగర్ శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు.పద్మారావునగర్ లోని ఎస్ పి కళాశాల నుండి వందల సంఖ్య విద్యార్థులతో కలసి బి ఆర్ ఎస్ పద్మమారావునగర్ ఇంచార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కళాశాలకు బాకీ ఉన్న పీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీ కి ముఖ్య అతిథిగా హాజరైన తలసాని శ్రీనివాస్ యాదవ్ విద్యార్థులతో కలిసి ఎస్ పి కళాశాల నుండి పద్మారావునగర్ ఎన్ టి ఆర్ కూడలి వరకు భారీ నిరసన ర్యాలీ లో పాల్గొన్నారు. అనంతరం పద్మారావునగర్ కూడలి వద్ద ఏర్పాటుచేసిన వేదిక వద్ద తలసాని మాట్లాడుతూ.... కాంగ్రెస్ ప్రభుత్వం కళాశాలకు బాకీ ఉన్న పీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యావ్యవస్థను నాశనం చేస్తున్నాడని అన్నారు.దీంతో రాష్ట్రంలోని విద్యార్థులు అనేక విధాలుగా ఇబ్బందులుపడుతున్నారని అన్నారు.ర్యాలీలో బీ ఆర్ ఎస్ నాయకులు,కార్యకర్తలు,మహిళలు,ఎస్ పి కళాశాల,విజ్ఞాన భారతి కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి