ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

మంగళవారం1 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:02 amసూర్యాస్తమయం 6:30 pm

మంగళవారం

1 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:02 am

సూర్యాస్తమయం 6:30 pm

SENSEX76,944-0.68%
NIFTY24,056-0.63%
హైదరాబాద్ 22K₹1,43,026/10g-4.82%
హైదరాబాద్ 24K₹1,56,028/10g-4.82%
వెండి₹2,14,509/kg-6.28%

తాజా వార్తలు

రాష్ట్రంలో ని లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని మాజీమంత్రి,

BRS MLA Talasani Srinivas Yadav urged students to fight the Congress government over pending fee reimbursement and scholarship dues.

nagendra1 September 2026, 2:09 PM1 చూసులుtrinetnews.com
రాష్ట్రంలో ని లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని మాజీమంత్రి,

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్ , ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 1:

బిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. పీజు రీ యంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వం పై వత్తిడి తీసుకురావాలని కోరుతూ మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ABVP ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా వచ్చి వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయం వద్ద కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడవద్దనే ఆలోచనతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పీజు రీ యంబర్స్ మెంట్ ను తీసుకొచ్చారని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో స్కాలర్ షిప్ లు, ఫీజు రీ యంబర్స్ లు చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 11 వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిందని మండిపడ్డారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించని కారణంగా చదువు పూర్తయిన విద్యా సంస్థల యాజమాన్యాలు సర్టిఫికెట్ లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా మానసికంగా ఆందోళన చెందుతున్నారని అన్నారు. విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే పోరాటాలకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించేలా ఈ నెల 7 వ తేదీ నుండి జరిగే అసెంబ్లీ సమావేశాలలో వత్తిడి తీసుకొస్తామని చెప్పారు. విద్యార్థులు ఐక్య పోరాటాలు చేయడం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని గుర్తించాలని పిలుపునిచ్చారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ విషయంలో జెన్ జీ లు నిర్వహించిన ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం వనికిపోయిందని, కేంద్రమంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పారు. అదే స్ఫూర్తితో విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేసిన వారిలో ABVP నాయకులు బాలు, అభినయ్, గౌతమ్, రేవంత్ తదితరులు ఉన్నారు

ఇవి కూడా చదవండి