ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు08;
బిఆర్ఎస్ పార్టీ మోటకొండూర్ సోషల్ మీడియా కన్వీనర్ గంధమల్ల మధు మాట్లాడుతూ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ నాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ నాయకుడైన కేసీఆర్ చావును కోరుకోవడం విడ్డూరంగా ఉంది. ఇదే కాంగ్రెస్ పార్టీకి దళితుల మీద ప్రేమ ఉంటే అంబేద్కర్ అభయస్తం కింద 25 లక్షలు ఇస్తామన్నారు. ఎంతమంది దళితులకు అమలు చేశారు.ఎంతమంది దళితులకు దళిత బంధు ఇచ్చినారు.దళిత డిక్లరేషన్లు ఏమైనాయి ఇంతవరకు.అలాగే ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారు.ఏ ప్రభుత్వం దళితులకు సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు వెయ్యలేదు.ఈ ప్రభుత్వం దళితుల మీద మొసలు కన్నీరు కారుస్తున్నారు. కాంగ్రెస్ గుండాలరా కెసిఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే యావత్ తెలంగాణ మొత్తం రణరంగమే.కాంగ్రెస్ నాయకులు కెసిఆర్ ఫామ్ హౌస్ దగ్గర ధర్నా గాని కెసిఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే బిఆర్ఎస్ పార్టీ దళిత నాయకులందరూ కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు చావు డప్పు మోగిస్తాం.అలాగే మంత్రుల, ఎమ్మెల్యేల ఇంటి ముందు చావు డప్పు మోగిస్తామని అన్నారు.





