పద్మారావునగర్ బీ ఆర్ ఎస్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్.
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్,సెప్టెంబర్,4. అమలుచేయలేని హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని పద్మారావునగర్ బీ ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. బీ ఆర్ ఎస్ పోరుబాట కార్యక్రమంలో భాగంగా డివిజన్ అధ్యక్షుడు వెంకటేశనరాజు,పార్టీ శ్రేణులతో కలసి పద్మారావునగర్ ఎన్ టి ఆర్ కూడలి వద్ద వంట వార్పు కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టి నిరసన ప్రదర్శన నిర్వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ....అమలు చేయలేని హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని అన్నారు.ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టిందని అన్నారు.ఎన్నికల గ్యారంటీ కార్డు ప్రకారం ఇవ్వవలసిన కాంగ్రెస్ బాకీ కార్డును ప్రదర్శించారు.






