ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు09:
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పురపాలక సంఘం పరిధిలోని 35వ వార్డు నివాసి బండ పద్మకి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద మంజూరైన రూ. 22,500/- (ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు) చెక్కును బుధవారం రోజు మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు సిఎంఆర్ఎఫ్ (CMRF)ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలుస్తోందని తెలిపారు. లబ్ధిదారురాలు బండ పద్మ తనకు సహాయం అందించిన ముఖ్యమంత్రికి, చైర్ పర్సన్ కి కృతజ్ఞతలు తెలిపారు.





