నాచారం, ట్రైనెట్ న్యూస్ , సెప్టెంబర్ 9 :
పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తోందని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. నాచారం, హెచ్ఎంటీ నగర్ డివిజన్ లకు చెందిన పలువురు ఆర్థిక సాయం కోసం ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డిని కలిసి దరఖాస్తు చేసుకున్నారు. వారి అభ్యర్థనలను పరిశీలించిన ఎమ్మెల్యే సీఎం కార్యాలయం ద్వారా రిలీఫ్ ఫండ్ మంజూరయ్యేలా చొరవ తీసుకున్నారు. మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బన్నెపాక పరశురాం రూ.42,000, టి. రేఖ రూ.37,500, బి. శశిరేఖ రూ.54,000 చొప్పున చెక్కులు అందజేశారు. మొత్తం రూ.1,33,500 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నాయకులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
పేదల పాలిట వరం సీఎం రిలీఫ్ ఫండ్..
BRS leaders distributed CMRF checks worth Rs 1,33,500 to beneficiaries in Nacharam and HMT Nagar divisions, facilitated by Uppal MLA Bandari Laxma Reddy.

ఈ వార్తను షేర్ చేయండి
లింక్లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

Bhongir Municipal Chairperson Tangallapalli Srivani Ravikumar handed over a CMRF check of Rs. 22,500 to a 35th ward resident on Wednesday.
మిగతా చదవండి →ఇటీవల మృతి చెందిన నూనెముంతల బుచ్చిరాములు గౌడ్ చిత్ర పటానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం ఖప్రాయపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ నూనెముంతల బుచ్చి రాములు గౌడ్ మృతి చెందగా, వారి కుటుంబాన్ని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బుచ్చి రాములు గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మిగతా చదవండి →అపెక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యేమ్మే కల్యాణ్ ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

Former Government Whip Gongidi Sunitha Mahender Reddy visited Yemme Kalyan, who is receiving treatment at Apex Hospital in Boduppal following an accident.
మిగతా చదవండి →యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎంఎస్ఎంఈ ర్యాంప్ అవగాహన కార్యక్రమం

A one-day awareness program on MSME RAMP was held at the Government Polytechnic College in Yadagirigutta to guide students on business opportunities and entrepreneurship.
మిగతా చదవండి →