ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం16 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:17 pm

బుధవారం

16 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:17 pm

SENSEX74,136-1.02%
NIFTY23,172-1.30%
హైదరాబాద్ 22K₹1,43,822/10g-0.94%
హైదరాబాద్ 24K₹1,56,897/10g-0.94%
వెండి₹2,16,956/kg+0.92%

తాజా వార్తలు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు నేడు తిరుమలకు ముఖ్యమంత్రి... స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ

Chief Minister N. Chandrababu Naidu will arrive in Tirumala on Tuesday to present silk garments to Lord Venkateswara on behalf of the state government during the annual Brahmotsavams.

nagendra16 September 2026, 1:58 AM0 చూసులుtrinetnews.com
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు  నేడు తిరుమలకు ముఖ్యమంత్రి... స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

రేపు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం

అమరావతి, ట్రైనెట్ న్యూస్

సెప్టెంబర్‌ 15: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తిరుమలకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు తిరుమలలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి... సాయంత్రం 5.30 గంటలకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల మైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి సాయంత్రం 6.20 గంటలకు గాయత్రీ నిలయానికి చేరుకుంటారు. రాత్రి 7.40 గంటలకు బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. అనంతరం రాత్రి 7.55 గంటల నుంచి 9.15 గంటల వరకు వేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించి, స్వామి వారిని దర్శించుకుంటారు. దర్శనం అనంతరం గాయత్రీ నిలయానికి చేరుకుని రాత్రి బస చేస్తారు.

తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

బుధవారం ఉదయం 8.40 గంటలకు వీఐపీ క్యూ కాంప్లెక్స్‌-1లోని 17వ కంపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన యాత్రికుల అనుభవ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం

9.15 గంటలకు గోగర్భం డ్యామ్‌ సర్కిల్‌ వద్ద ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రారంభిస్తారు. 9.35 గంటలకు ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభించి

అధికారులతో సమావేశమవుతారని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి