హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 9:
పర్యావరణ పరిరక్షణ గాను మట్టి వినాయకుడిని పూజించాలని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ముకుంద రెడ్డి పేర్కొన్నారు. బుధ వారం సమాచార పౌర సంబంధాల శాఖ ఉద్యోగులకు మట్టి గణపతి ప్రతిమల పంపిణీని కమీషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముకుంద రెడ్డి మాట్లాడుతూ, పండుగలను పర్యావరణ పరిరక్షణలో భాగంగా భాద్యతాయుతంగా జరుపుకోవాలని అన్నారు. జల వనరుల పరిరక్షణ కాలుష్య నివారణకు కేవలం మట్టి గణపతి మాత్రమే పూజించాలని పేర్కొన్నారు. ఈ ఉచిత గణపతి ప్రతిమల కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ డి.ఎస్ జగన్ తో పాటు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు






