చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 20 :
మనోరంజని మెలోడిస్ , ఆదర్శ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు వేదికలో సినీ స్వరసుమాంజలి - సినీ దిగ్గజాలు -1" పేరిట సినీ సంగీత విభావరి త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పి.వెంకటేశ్వర్ కు : కిశోర్ కుమార్ స్మారక పురస్కారం ప్రధానం చేశారు. సభకు ముందు నవరస గాయని ఆమని నిర్వహణలో స్వర్ణ కిరీటి పి.సుభాష్, స్వరరత్న కృష్ణ ప్రసాద్, అంజనేయ శాస్త్రి, శ్రీకాంత్ చారి ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.







