చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 22: మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా
బాలాజీ ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫౌండేషన్ గ్లోబల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో "స్టార్ స్టార్... మెగా స్టార్ స్టార్" పేరిట తెలుగు , హిందీ సినీ సంగీత విభావరీ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ కళా సంగీత నాట్య వేదిక లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిటీ సివిల్ కోర్ట్
పిడి.లక్ష్మి కుమారి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా
ప్రసిద్ధ గాయిని, స్వరరాగ రస మాధురి అనురాధ కు 'భక్తి గాన శిరోమణి' బిరుదును ప్రధానం చేశారు . సంస్థ అధ్యక్షుడు రామోజీ నిర్వహణలో ప్రముఖ గాయనీ, గాయకులు ఎస్.పి.మాధురి , జి.వెంకట్రావు, శ్యాంబాబు, సుబ్బారెడ్డి, బి.వాసు, శ్రీమతి జయలిలత, శ్రీమతి ప్రణీత, పి.ఆర్యా, నాగశ్రీష తదితరులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.








