ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం2 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:02 amసూర్యాస్తమయం 6:29 pm

బుధవారం

2 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:02 am

సూర్యాస్తమయం 6:29 pm

SENSEX76,453-0.63%
NIFTY23,865-0.94%
హైదరాబాద్ 22K₹1,41,908/10g-2.80%
హైదరాబాద్ 24K₹1,54,809/10g-2.80%
వెండి₹2,12,059/kg-4.00%

తాజా వార్తలు

తప్పిపోయిన వారి కోసం వెతికి.. కుటుంబాల చెంతకు చేర్చిన పోలీసులు..

Chilkalguda police showed great humanity by providing shelter to two lost elderly women and successfully reuniting them with their families.

nagendra2 September 2026, 1:04 AM2 చూసులుtrinetnews.com
తప్పిపోయిన వారి కోసం వెతికి.. కుటుంబాల చెంతకు చేర్చిన పోలీసులు..

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

* ఆశ్రయం కల్పించి ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు..

* పత్రికల్లో వచ్చిన ఫొటోలతో కుటుంబ సభ్యుల గుర్తింపు..

చిలకలగూడ, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 1: దిక్కుతోచని స్థితిలో ఉన్న ఇద్దరు వృద్ధ మహిళలకు చిలకలగూడ పోలీసులు అండగా నిలిచారు. తప్పిపోయిన వారిని కేవలం గుర్తించడమే కాకుండా, వారి కుటుంబ సభ్యుల చెంతకు క్షేమంగా చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆగస్టు 31న చిలకలగూడ పోలీసుల పరిధిలో కనిపించిన బాలమణి, గోవిందమ్మలను ముందుగా డ్రీమ్ ఇండియా హోమ్‌లో ఆశ్రయం కల్పించారు. అనంతరం వారి వివరాలు, ఫొటోల ఆధారంగా కుటుంబ సభ్యుల కోసం పోలీసులు ఆరా తీశారు. పోలీసుల ప్రయత్నాలకు ఫలితం దక్కింది. గోవిందమ్మ కుటుంబ సభ్యులు సమాచారం అందుకుని పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆమెను గుర్తించి ఇంటికి తీసుకెళ్లారు. మరోవైపు వికారాబాద్‌ కు చెందిన బాలమణి ఫొటోను పత్రికల్లో చూసిన కుటుంబ సభ్యులు చిలకలగూడ పోలీసులను సంప్రదించారు. వివరాలను పరిశీలించి గుర్తింపును నిర్ధారించిన పోలీసులు డ్రీమ్ ఇండియా హోమ్ నుంచి బాలమణిని తీసుకొచ్చి ఆమె బంధువులకు అప్పగించారు. ఇన్‌స్పెక్టర్ వలిశెట్టి రామకృష్ణ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ పూస శ్రీనివాస్ ప్రత్యేక చొరవ చూపి ఇద్దరు మహిళలు తిరిగి తమ కుటుంబాలను చేరుకునేలా చర్యలు చేపట్టారు. ఎన్నో ఆందోళనల తర్వాత తమ వారిని సురక్షితంగా తిరిగి చూసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనలో చిలకలగూడ పోలీసులు చూపిన చొరవ, ఆప్యాయతకు స్థానికుల నుంచి అభినందనలు వ్యక్తమయ్యాయి.

ఇవి కూడా చదవండి

తెలంగాణలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు..

తెలంగాణలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు..

నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్‌ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండించి, పరామర్శించేందుకు వెళ్తున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వారం రోజుల్లో తనను రెండోసారి గృహనిర్బంధం చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని ఆయన విమర్శించారు.

మిగతా చదవండి →