నల్లగొండ, అమ్మనబోలు, ట్రైనేట్ న్యూస్, సెప్టెంబరు 10: చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొంపల్లి సైదులు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆమె ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు బసాని శంకరయ్య, శివ, శ్రావణ్, హరీష్, సతీష్, సాయి, మల్లేష్, సాయి కుమార్, సాయి ప్రసాద్, శ్రీనివాస్, బసాని మల్లేష్ (జానయ్య కుమారుడు), పైళ్ల నవీన్ తదితరులు పాల్గొని చాకలి ఐలమ్మకు నివాళులర్పించారు.





