హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్,సెప్టెంబర్,3.
కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలన వైఫల్యాలను ఎండగడుతూ BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ మాజీ మంత్రి వర్యులు శ్రీనివాస్ యాదవ్ గార్ల పిలుపు మేరకు పద్మారావు నగర్ చౌరస్తాలో శుక్రవారం ఉదయం 10 గంటలకు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు BRS పార్టీ పద్మారావు నగర్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ తెలిపారు… మహిళకు 2500 ఆర్ధిక సహాయం,కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం,విద్యార్థినులకు ఉచితంగా స్కూటీలు ఇస్తామని ఎన్నికల సమయం లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న తర్వాత కూడా రాష్ట్రంలో హామీల్ని నెరవేర్చలేదని పవన్ కుమార్ విమర్శించారు … కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని అందుకు నిరసనగా పద్మ రావు నగర్ డివిజన్ లో 4 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.. పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు..





