హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 7;
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డగించడంతో ఉద్రిక్తత చోటుచేసుకొంది. నల్లని టీషర్టులతో నినాదాలు చేసుకొంటూ వచ్చిన బీఆర్ఎస్ నాయకులను అలా రావద్దని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల అభ్యంతరంతో టీషర్టులు విప్పి బనియన్లతో హరీష్ రావు , ఎమ్మెల్యేలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అసెంబ్లీ ప్రవేశద్వారం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తంచేశారు. హరీష్ రావు తో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు.






