* పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసిన జనసేన కార్యకర్తలు..
నాచారం, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 2:
జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి నాచారం డివిజన్లోని సిడిఎస్ భవనంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఉప్పల్ నియోజకవర్గ ఇన్చార్జ్ నిహారిక ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయవచ్చని, సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత మరింతగా భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాచారం డివిజన్ జనసేన నాయకులు రామకృష్ణారెడ్డి, జమ్మల మధు, సోమేశ్, కే. మధు, సాయికిరణ్, వి. మధు, సారయ్య రాజు తదితరులు పాల్గొన్నారు.





