చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 15 :
నివేదిత ఆర్ట్స్ అసోసియేషన్ నిర్వహణలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సినీ దేశభక్తి లలిత జానపద గీతాలు సమ్మేళనం చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలోని కళా వెంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు . కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్
కోలేటి దామోదర్ గుప్తా, ఆదర్శ ఫౌండేషన్ అధ్యక్షుడు కుసుమ భోగరాజు , ప్రముఖ సామాజికవేత్త వడ్లకొండ వెంకట్రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి సినీ చైతన్య గీతాలను ఆలపించడం అభినందనీయమన్నారు. సభకు ముందు ప్రముఖ నవరస గాయనీ ఆమని నిర్వహణలో గాయనీ, గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.





