ప్రశ్నించే గొంతులను నొక్కడం సిగ్గుచేటు
ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు07:
బీజేవైఎం రాష్ట్రయువ మోర్చా సోమవారం రోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్న బీజేవైఎం నాయకులను దొంగల బంధించడం సిగ్గుచేటు. విద్యార్థులకు అందవలసిన ఫీజు రీయింబర్స్మెంట్ మొండి బకాయిలను చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ సర్కార్ గద్దె దిగాలి .100 రోజులలో విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి గద్దెనెక్కిన ప్రభుత్వం విద్యార్థులకు బకాయిలు చెల్లించకుండా 1000 రోజులలో జరిగిన ఈ అవినీతి పాలనను ప్రజా పాలన అంటూ సంబరాలు చేసుకుంటున్నదీ. విద్యార్థులకు రావలసిన మొండి బకాయిలను తక్షణమే చెల్లించకుంటే ఈ పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని బీజేవైఎం మండల ప్రెసిడెంట్ ఫైళ్ళ ప్రశాంత్ హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో బీజేవైఎం ప్రధాన కార్యదర్శి లోడి మహేష్, పొనగాని సూర్యప్రకాష్, బండారి సాయి, తదితరులు ఉన్నారు.





