* భరత్ గౌడ్ నాయకత్వంలో నిరసన.. భారీగా పాల్గొన్న బీజేపీ శ్రేణులు..
* నాయకులు, కార్యకర్తల అరెస్ట్.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలింపు..
సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 7 :
విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహంకాళి సికింద్రాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ భరత్ గౌడ్ నాయకత్వంలో బీజేపీ శ్రేణులు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ నిరసనలో జిల్లా నాయకులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయినప్పటికీ విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం బీజేపీ శ్రేణులు నిరసన కొనసాగించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, విద్యార్థుల ఫీజు బకాయిలు, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహంకాళి సికింద్రాబాద్ జిల్లా ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్ శ్రీరామ్ వెంకట్, నందు, హరి, గడ్డం నవీన్, శారద, తార్నాక డివిజన్ బీజేపీ అధ్యక్షులు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.






