ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

మంగళవారం8 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:03 amసూర్యాస్తమయం 6:24 pm

మంగళవారం

8 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:03 am

సూర్యాస్తమయం 6:24 pm

SENSEX76,133-1.05%
NIFTY23,779-1.15%
హైదరాబాద్ 22K₹1,44,959/10g+2.78%
హైదరాబాద్ 24K₹1,58,137/10g+2.78%
వెండి₹2,20,954/kg+4.24%

తాజా వార్తలు

విద్యార్థుల ఫీజు బకాయిల విడుదలకు బీజేపీ అసెంబ్లీ ముట్టడి..

BJP leaders and cadres staged a protest laying siege to the Assembly, demanding the immediate release of pending fee reimbursement and scholarships.

nagendra8 September 2026, 1:39 AM0 చూసులుtrinetnews.com
విద్యార్థుల ఫీజు బకాయిల విడుదలకు బీజేపీ అసెంబ్లీ ముట్టడి..

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

* భరత్ గౌడ్ నాయకత్వంలో నిరసన.. భారీగా పాల్గొన్న బీజేపీ శ్రేణులు..

* నాయకులు, కార్యకర్తల అరెస్ట్.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలింపు..

సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 7 :

విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌ షిప్‌ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహంకాళి సికింద్రాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ భరత్ గౌడ్ నాయకత్వంలో బీజేపీ శ్రేణులు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ నిరసనలో జిల్లా నాయకులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయినప్పటికీ విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం బీజేపీ శ్రేణులు నిరసన కొనసాగించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, విద్యార్థుల ఫీజు బకాయిలు, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహంకాళి సికింద్రాబాద్ జిల్లా ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్ శ్రీరామ్ వెంకట్, నందు, హరి, గడ్డం నవీన్, శారద, తార్నాక డివిజన్ బీజేపీ అధ్యక్షులు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సీఎం క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు చావు డప్పు కొడుతున్నారు: బిఆర్‌ఎస్ నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డి

సీఎం క్షమాపణ చెప్పాలి  కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు చావు డప్పు కొడుతున్నారు: బిఆర్‌ఎస్ నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డి

BRS leader Kalluri Ramachandra Reddy demanded that Chief Minister Revanth Reddy apologize for governance failures, stating the public is turning against Congress.

మిగతా చదవండి →