నెల్లూరు సీటీ ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 5:
డాక్టర్ కొండూరు హరినారాయణ రెడ్డి మరియు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఉదయం నెల్లూరు పోస్టల్ కాలనీ లోని హరినారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం నందు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్బంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయులను సత్కారించడం జరిగింది. ఈసందర్భంగా కంచి డోమినిక్ రెడ్డి, డాక్టర్ చీదరాల చెన్నయ్య, చంద్రాయుడు లను ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో డాక్టర్ కొండూరు హరినారాయణ రెడ్డి, కె.మురళీమోహన్ రాజు, vబి.గురుమూర్తి, డాక్టర్ గుంజి నరసింహారావు, పాయసం వెంకటేశ్వర రావు, నెల్లూరు సుధాకర్ రెడ్డి, ఎ.జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.





