ట్రైనెట్ న్యూస్,యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు06:
యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న జడ్పీహెచ్ఎస్ మోత్కూర్ ఉపాధ్యాయుడు ఇండ్ల రాంప్రసాద్, జడ్పీహెచ్ఎస్ పాటిమట్ల ఉపాద్యాయుడు దర్శనం వెంకన్న,మరియు ఎంపీ యుపిఎస్ కాంచనపల్లి ఉపాద్యాయుడు కూరెళ్ల యాకస్వామిలకు శుభాకాంక్షలు తెలియచేస్తూ మోత్కూర్ పట్టణ కేంద్రంలో ఘనంగా శాలువాలతో సన్మానించి ఈ సందర్బంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా స్థాయి అవార్డులు రావడం ఈ ప్రాంతానికే గర్వకారణం అని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్, బిఆర్ఎస్ నాయకులు మర్రి అనిల్ అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు దాసరి తిరుమలేష్, కూరెళ్ల పరమేష్, ప్రభుత్వ ఉపాధ్యాయులు మందుల కృష్ణయ్య,కూరెళ్ల రవి, దళిత నాయకులు కూరెళ్ల రమేష్, చుక్క అశోక్, కొంపెల్లి మల్లెష్, కూరెళ్ల శ్రీశైలం, కూరెళ్ల నర్సింహా, చెడిపెల్లి ఆనంద్ మరియు కందుకూరి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.






