చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 19 : ప్రగతి మహిళా సామాజిక సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో 43వ సంచికగా "80 వసంతాల స్వతంత్ర భారత మహోత్సవాన్ని పురస్కరించుకుని "ఏదేశమేగినా ఎందుకాలిడినా" సినీ సినీ సంగీత విభావరి
శ్రీ త్యాగరాయ గాన సభలోని గుండవరపు హనుమంతరావు వేదికలో నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా చీఫ్ కో-ఆర్డినేటర్ జంగి నరేందర్ గౌడ్,
ఉస్మానియా హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ శ్రీమన్నారాయణ , మోహన్ శ్రీ మల్లిక్, ప్రతాప్ మల్లాది, దుర్గాప్రసాద్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకురాలు సుధారాణి కృష్ణం రాజు నిర్వహణలో ప్రసిద్ధ గాయనీ గాయకులు జూనియర్ బాలు 'అగ్నివర్ష' నాగ శివ రామ్, మైమంజుల, భాను కస్తూరి, ఉష మల్లాది, ఎం.పి.లక్ష్మీదేవి, ఉమామహేష్ తదితరులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి. కార్యక్రమంలో సంస్థ చీఫ్ కో-ఆర్డినేటర్
కొండ రవీందర్ పాల్గొన్నారు.








