హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 31:
హరికథా ప్రక్రియకు సాహిత్యం లో ఉన్నత స్థాయి కల్పించిన అదిభొట్ల నారాయణ దాసు ఆ ప్రక్రియకు భీష్మచార్యులు వంటి వారని రాష్ట్ర హస్త కళల సంస్థ చైర్మెన్ నాయుడు సత్యనారాయణ అన్నారు శ్రీ త్యాగరాయ గానసభ లోని గుండవరపు హనుమంత రావు కళా వేదిక పై హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసు జయంతి సమావేశం గాన సభ నిర్వహణలో ఎందరో మహానుభావులు కార్యక్రమ పరంపర లో భాగంగా జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న నాయుడు సత్యనారాయణ మాట్లాడుతూ నారాయణ దాసు హరికథ కళా ప్రక్రియకు మార్గ దర్శి మాత్రమే కాక ఆయన కవీ శాస్తీయ సంగీత కళా కారుడు అని చెప్పారు గాన సభ అధ్యక్షుడు కళా జనార్థన మూర్తి అధ్యక్షత వహించిన వేదిక పై ప్రముఖ హరి కథకులు రామబట్టర్ కాకర్ల హనుమంత రావు గీతా దేవి డాక్టర్ జయ రాములు పాల్గొన్నారు







