డ్రగ్స్ పై అవగాహన కల్పించాలి అని ప్రధాని మన్ కి బాత్ ద్వారా పిలుపునిచ్చారు.
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 30:
గాంధీనగర్ డివిజన్ బూత్ నెం:7 చిక్కడపల్లి వివేక్ నగర్ బస్తీ లో బిజెపి నేతలు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడి గారి 137వ మన్ కి బాత్ ప్రసారాన్ని ఆదివారం ఏర్పాటుచేశారు. ముఖ్య అతిథిగా బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ శ్రీ ఎ.వినయ్ కుమార్ గారు పాల్గొని, బిజెపి నాయకులు, కార్యకర్తలు, స్థానికులతో కలిసి మోడీ గారి ప్రసంగాన్ని విన్నారు. అనంతరం మన్ కి బాత్ విశేషాలు వివరిస్తూ,యువత కోసం 'డ్రగ్-ఫ్రీ ఇండియా' క్యాంపెయిన్ దేశవ్యాప్తంగా డ్రగ్-ఫ్రీ ఇండియా'వేగం పుంజుకుంటోందని,వ్యసనం ఒక వ్యక్తినే కాదు, మొత్తం కుటుంబాన్ని,సమాజాన్ని నాశనం చేస్తుంది.డ్రగ్స్ పై అవగాహన కల్పించే వారిని, బాధితులకు సహాయం చేసే వారిని అభినందిస్తున్నాను" అని మోడీ గారు పిలుపునిచ్చారనీ, అందుకు మనమందరం డ్రగ్-ఫ్రీ ఇండియా' కొరకు శ్రమించాలని అన్నారు. వాటితో పాటు పలు అంశాలపై ప్రసంగాన్ని సాగించారని అన్నారు. కార్యక్రమంలో బిజెపి నేతలు సత్యేంధర్, లావణ్య, మరియు వివేక్ నగర్ బస్తీ స్థానికులు సురేష్ బాబు,రాజు,అరుణమ్మ, సత్యమ్మ,చంద్రకళ,శివ,జ్యోతి,లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.





