ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు07:
తెలంగాణ అసెంబ్లీ వద్ద సోమవారం రోజు అసెంబ్లీ
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ రావు సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని దానికి సహకరించిన కేటీఆర్,హరీష్ రావులను అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయాలని ఆత్మకూరు (ఎం)మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందడి అనంతరెడ్డి డిమాండ్ చేశారు.ఇకపై ఏ శాసనసభ్యుడు కూడా ఇలాంటి భాష వాడకుండా కఠిన చట్టం తీసుకురావాలి అని వ్యక్తిగత దూషణలు చేసే వారిపై జీవితాంతం రాజ్యాంగ పరమైన పదవులకు అనర్హుడయ్యే విధంగా చట్టాలు రావాల్సిన అవసరం ఉంది అని తెలిపారు.స్పీకర్ పదవి అనేది రాజ్యాంగ పదవి దానిని అవమానించడం అంటే తెలంగాణ ప్రజలను అవమానించడమే అని అన్నారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ యాస లక్ష్మారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్ధసాని సిద్దులు గౌడ్ ప్రధాన కార్యదర్శి జన్నాయి కోడె నగేష్ పి ఎ సి ఎస్ డైరెక్టర్ పోతాగని మల్లేశం గౌడ్ జిల్లా కాంగ్రెస్ నాయకులు తండ శ్రీశైలం గౌడ్ భాష బోయిన పాపయ్య బీసీ సెల్ మండల అధ్యక్షులు చెరుకు శ్రీనివాస్ గౌడ్ మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు ఎద్దు వెంకటేశ్వర్లు సోషల్ మీడియా మండల కన్వీనర్ ఎలగందుల మహేష్ కొరటికల్ ఉప సర్పంచ్ మామిడి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.





