రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్, ఆగస్ట్ 16 : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చూడదగ్గ సినిమా 'వందే భారత్ సేవ్ ఇండియా' అని ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు ప్రశంసించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రవీంద్ర భారతి పైడి జయరాజు థియేటర్లో ఆగస్ట్ 15, 16 తేదీల్లో సాయంత్రం ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఏ మతాన్ని విమర్శించకుండా కొందరి లోపాలు చూపిస్తూ చిత్రీకరించడం సాధారణ విషయం కాదని రేలంగి నరసింహారావు విశ్లేషించారు. వందే భారత్ సినిమాకు దేశభక్తి పాట రాసిన జాతీయ సినీ గేయ రచయిత డా. సుద్దాల అశోక్ తేజను రూ. 30 వేల నగదు అవార్డుతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో వంశీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు డా. వంశీ రామరాజు, ప్రముఖ నటులు జెన్నీ, అశోక్ కుమార్, ఘర్షణ శ్రీనివాస్, బాలాజీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చొక్కాపు వెంకటరమణ, పేరడీ గురుస్వామి, బాలానగర్ ఏసీపీ పింగిళి నరేష్ రెడ్డి, దర్శకుడు మల్లం రమేష్, సాంస్కృతిక ప్రముఖులు రామడుగు వసంత్, భవిరి శివ, వెంకటి బాబు, మొగిలి వెంకటేశ్వర్లు, నాగసాయి, సామాజిక ప్రముఖులు కసిరెడ్డి భాస్కర రెడ్డి, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. పలువురికి జాతీయ సమైక్యతా అవార్డులు బహుకరించారు.





